న్యూఢిల్లీ: ఈ వారంతంలో జరిగే జీ-20 సమ్మిట్ జరుగనుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ సమావేశానికి పలు విదేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్ లో భాగంగా ‘మధర్ ఆఫ్ డెమోక్రసీ’ పేరుతో ఒక ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శనను చూసేందుకు వచ్చే దేశాధినేతలను ప్రత్యేక ‘అవతార్’ (ఏఐ జనరేటెడ్)ను అభివృద్ధి చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
KTR దుబాయ్లో కేటీఆర్ టూర్.. రాష్ట్రంలో రూ. 700 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన దుబాయ్ కంపెనీ
ఈ ప్రదర్శనలో దేశ ప్రజాస్వామ్య సంస్కృతులను ప్రదర్శించనున్నారు. ఇంగ్లిష్ సహా ఫ్రెంచ్ మాండరీన్, ఇటాలియన్, కొరియన్, జపనీస్ ఇలా 16 ప్రపంచ భాషల్లో ఆడియో ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. అలాగే 1951-52లో తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి చివరి లోక్ సభ ఎన్నికల(2019) వరకు ఎన్నికల విధానాల్లో వచ్చిన మార్పులను జీ20 దేశాధినేతల ముందు ప్రదర్శించనున్నారు.