Tuesday, May 21, 2024

రాష్ట్రంలో జరుగుతోంది ప్రజా పాలన కాదు…నయవంచన పాలన

spot_img

రాష్ట్రంలో జరుగుతోంది ప్రజా పాలన కాదు…నయవంచన పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తుక్కుగూడ సభలో రాహూల్ గాంధీతో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడించారని విమర్శించారు. పాపం రాహూల్ గాంధీకి ఏం తెలియదు రేవంత్ రెడ్డి ఏం చెప్పితే అది మాట్లాడి పోయాడన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం అమలు చేయలేదన్నారు బాల్క సుమన్. మేము ఇచ్చిన ఉద్యోగాలను వాళ్లు ఏదో ఇచ్చినట్లుగా డబ్బా కొట్టుకున్నారు. బీఆర్ఎస్ హయంలోనే 503  గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం,వీటికీ మరో 60 ఉద్యోగాలు కలిపి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు. మేము ఇచ్చిన ఉద్యోగాలను వాళ్ళు ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటు. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ పేరుతో మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్ని పేపర్ లో యాడ్స్ ఇచ్చారు. మేము ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను వాళ్లు ఇచ్చినట్లు పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారు. నిరుద్యోగులు ఇవ్వన్ని గమనిస్తున్నారని తెలిపారు.

టెట్ పరీక్ష ఫీజ్ ఏంటనే తగ్గించాలనీ మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. 1500లకు పై చిలుకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి అని గతంలో మాట్లాడారు..ఇప్పుడెందుకు 560 ఉద్యోగాలు మాత్రమే రిలీజ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకునట్లు 30 వేళ ఉద్యోగాలు మేము ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ప్రజలు మోస పోవడానికి సిద్ధంగా వుంటే ప్రజలను మోసం చేస్తా అని ఒక ఇంటర్వ్యూ లో రేవంత్ రెడ్డే చెప్పాడు. పచ్చి అబద్ధాలు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు.

25 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి అని చెప్పిన రేవంత్ రెడ్డి…. ఆ డబ్బులను కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు, పొంగులేటి కాంట్రాక్టు ఖాతాలోకి వెళ్లాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుందో రేవంత్ రెడ్డి మీడియాకు డైరెక్ట్ చెప్పొచ్చు కదా… చెప్పకుండా ప్రతి రోజు ఏదో ఒక లీక్ చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.  రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు…నీళ్ళు లేక అవస్థలు పడుతుంటే వీటిని పట్టించుకోకుండా అటెన్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఫైర్ అయ్యారు బాల్క సుమన్ . ఇక్కడ జరుగుతోంది ప్రజా పాలన కాదు …నయవంచన పాలన జరుతుంది. తెలంగాణ సంపద అంతా ఢిల్లీకి చేర వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులు డమ్మీ అభ్యర్థులే అని తెలిపారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు … కిషన్ రెడ్డి గెలుపు కోసం దానం నాగేందర్ ను మా పార్టీ నుండి తీసుకోని ప్రకటించాడు.

మోడీ బడే బాయ్….రేవంత్ రెడ్డి చోటే బాయ్ అని అన్నారు బాల్క సుమన్. మోడీ చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో డమ్మీ అభ్యర్థులను ప్రకటించారన్నారు. కొడంగల్ పోయి మొసలి కన్నీరు కారుస్తున్నాడు రేవంత్ రెడ్డి అని తెలిపారు. మొన్నటి వరకు బీజీపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు. ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ, బీజీపీ ఒక్కటయ్యారన్నారు. రెండు పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీనే బలమైన పార్టీ అందుకే మా పార్టీ నాయకులను కాంగ్రెస్ , బీజీపీ పార్టీలు తీసుకుని అభ్యర్థులగా పెట్టుకున్నారని తెలిపారు.

రేవంత్ రెడ్డి ఎంత సేపు జైలు.. జైలు అని మాట్లాడుతున్నాడు. గత అనుభవాలు, స్మృత్తులు గుర్తుకు వస్తున్నట్టున్నాయ్, అందుకే ఎంతసేపు జైలు అంటున్నాడు.  ఓటుకి నోట్ కేసు లు చిప్పకూడు తిన్నది గుర్తుకు వచ్చినట్టుంది రేవంత్ రెడ్డికి అని అన్నారు బాల్క సుమన్.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి అమ్ముడుపోయే వ్య‌క్తి…

Latest News

More Articles