హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత బృందాన్ని ఈరోజు బీసీసీఐ ప్రకటించింది. టెస్టులు, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన అజింక్యా రహానే కు వైస్ కెప్టెన్గా నియమించింది. సంజూ శాంసన్ వన్డే జట్టు వికెట్ కీపర్గా ఎంపియ్యాడు. ఐపీఎల్ 16వ సీజన్లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్, ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ వన్డే, టెస్టు జట్టులోకి ఎంపికయ్యారు. పుజారా, షమీలకు విశ్రాంతినిచ్చారు.
టెస్టు జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జయదేవ్ ఉనాద్కాట్, నవదీప్ సైనీ.
వన్డే జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనాద్కాట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.