స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి ఐదో టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానున్న ఈ టెస్టులో ఆడతాడనుకున్న మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడుతుండటంతో బీసీసీఐ అతడిని ఈ టెస్టులో కూడా లెక్కలోకి తీసుకోలేదు. నాలుగో టెస్టులో విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా తిరిగి జట్టుతో చేరనున్నాడు.
ఈ రెండు మార్పులతో పాటు నాలుగో టెస్టు వరకూ జట్టుతోనే ఉన్న వాషింగ్టన్ సుందర్ను బీసీసీఐ రిలీజ్ చేసింది. అతడు రంజీట్రోఫీలో భాగంగా మార్చి 2 నుంచి ముంబైతో జరుగబోయే సెమీస్ మ్యాచ్ కోసం తమిళనాడుకు ఆడనున్నాడు. ఈ మూడు మార్పులు తప్ప భారత జట్టులో మార్పులేమీ లేవు. ఇదిలాఉండగా హైదరాబాద్ టెస్టులో ఆడి ఆ తర్వాత గాయంతో వెనుదిరిగిన కేఎల్ రాహుల్ త్వరలోనే లండన్ వెళ్లనున్నట్టు బీసీసీఐ ప్రకటనలో తెలిపింది.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రిత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, ఆకాశ్ దీప్.
ఇది కూడా చదవండి: అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ రాష్ట్రాన్ని అధోగతి పాలుజేస్తోంది