Sunday, May 19, 2024

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న

spot_img

భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కు భారత రత్న ప్రకటించింది.

తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారత రత్న దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ తెలిపారు. పీవీకి భారత రత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ ను గౌరవించి పీవీ నరసింహారావు కు భారత రత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు

Latest News

More Articles