హైదరాబాద్: 2024 పద్మపురస్కారాల్లో టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి అరుదైన దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం అయిన పద్మవిభూషణ్ వచ్చిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శుక్రవారం టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా మెగాస్టార్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసారు.
అనంతరం టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. చిరుకు పద్మవిభూషణ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవిని ఘనంగా సన్మానం చేసేందుకు ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఈ ఈవెంట్లో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
Also Read.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలువబోతున్నం