Saturday, May 18, 2024

డ్రీమ్ 11లో రూ. 49లతో జాక్‎పాట్ కొట్టిన గ్యాస్ డెలివరీ బాయ్

spot_img

ఇంటింటికి గ్యాస్​ సరఫరా చేసే ఓ యువకుడు రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఫాంటసీ క్రికెట్‌ గేమ్‌లో జాక్‌పాట్‌ కొట్టాడు. రూ.49 పెట్టి డ్రీమ్​-11 యాప్‌లో గేమ్‌ ఆడిన అతడు ఏకంగా రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. బీహార్​, అరారియా జిల్లా సదర్ మండలం పటేగనా గ్రామంలో సాదిక్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతడు స్థానికంగా ఉండే ఉమా రాజ్​ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్​గా పనిచేస్తున్నాడు. క్రికెట్​పై ఆసక్తి ఉన్న సాదిక్ జనవరి 14న జరిగిన భారత్- అఫ్గానిస్థాన్​ మ్యాచ్‌లో రూ.49 పెట్టి డ్రీమ్​-11లో ఫాంటసీ గేమ్‌ ఆడాడు. ఈ మ్యాచ్​లో 974.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. ప్రస్తుతం సాదిక్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ‘ఈ విజయంతో మా కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా భారత్, అఫ్గానిస్థాన్​ మ్యాచ్​లో రూ.49తో గేమ్​ ఆడాను. మిలియనీర్​ కావాలనే నా కల కొన్ని గంటల్లోనే నెరవేరింది’ అని సాధిక్ ఆనందపడుతున్నాడు.

Read Also: అయోధ్య రాముడి పాటకు విద్యార్థులతో టీచర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో

సాధిక్ అప్పుడప్పుడు చిన్న మొత్తాలను గెలుచుకునేవాడు. ఈసారి ఏకంగా డ్రీమ్​-11 గేమ్​ టాలీ బోర్డ్​లో తొలి స్థానం వచ్చిందని చెప్పాడు. కానీ ఈ విషయం చెబితే సాదిక్​ను ఎవరూ నమ్మకపోగా.. పుకారుగా కొట్టిపారేశారు. కానీ సాధిక్​ ఖాతాలోకి డబ్బు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై సాధిక్​ పని చేసే ఉమా రాజ్ గ్యాస్​ ఏజెన్సీ డైరెక్టర్ జితేంద్ర కుమార్​ సింగ్ స్పందించారు. సాధిక్ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చిన వెంటనే వాటిని ఫిక్స్​డ్​ డిపాజిట్ చేశామని ఆయన తెలిపారు.

Latest News

More Articles