ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసే ఓ యువకుడు రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఫాంటసీ క్రికెట్ గేమ్లో జాక్పాట్ కొట్టాడు. రూ.49 పెట్టి డ్రీమ్-11 యాప్లో గేమ్ ఆడిన అతడు ఏకంగా రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. బీహార్, అరారియా జిల్లా సదర్ మండలం పటేగనా గ్రామంలో సాదిక్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతడు స్థానికంగా ఉండే ఉమా రాజ్ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాడు. క్రికెట్పై ఆసక్తి ఉన్న సాదిక్ జనవరి 14న జరిగిన భారత్- అఫ్గానిస్థాన్ మ్యాచ్లో రూ.49 పెట్టి డ్రీమ్-11లో ఫాంటసీ గేమ్ ఆడాడు. ఈ మ్యాచ్లో 974.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. ప్రస్తుతం సాదిక్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ‘ఈ విజయంతో మా కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్లో రూ.49తో గేమ్ ఆడాను. మిలియనీర్ కావాలనే నా కల కొన్ని గంటల్లోనే నెరవేరింది’ అని సాధిక్ ఆనందపడుతున్నాడు.
Read Also: అయోధ్య రాముడి పాటకు విద్యార్థులతో టీచర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో
సాధిక్ అప్పుడప్పుడు చిన్న మొత్తాలను గెలుచుకునేవాడు. ఈసారి ఏకంగా డ్రీమ్-11 గేమ్ టాలీ బోర్డ్లో తొలి స్థానం వచ్చిందని చెప్పాడు. కానీ ఈ విషయం చెబితే సాదిక్ను ఎవరూ నమ్మకపోగా.. పుకారుగా కొట్టిపారేశారు. కానీ సాధిక్ ఖాతాలోకి డబ్బు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై సాధిక్ పని చేసే ఉమా రాజ్ గ్యాస్ ఏజెన్సీ డైరెక్టర్ జితేంద్ర కుమార్ సింగ్ స్పందించారు. సాధిక్ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చిన వెంటనే వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని ఆయన తెలిపారు.