బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. మంత్రి జమా ఖాన్ ఎస్కార్ట్ కారు అర్థరాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ససారం సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పరసాతువా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కథనం అప్ డేట్ అవుతోంది. .
ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు.. జనవరి 6, 7న గ్రూప్-2 ..!!