డీజేగా పనిచేస్తున్న ఓ యువకుడికి బంపర్ లాటరీ తగిలింది. రూ. 49తో బెట్టింగ్ పెడితే.. ఏకంగా కోటి రూపాయల లాటరీ వచ్చింది. బీహార్లోని నవాదా జిల్లాలోని పిప్రా గ్రామానికి చెందిన రాజురామ్ స్థానికంగా డీజేగా పనిచేస్తున్నాడు. కాగా.. రాజురామ్కు ‘డ్రీమ్ 11’ ఆడటం అలవాటు. గత ఏడాదిన్నరగా ‘డ్రీమ్11’లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బీపీఎల్ టోర్నీకి సంబంధించి రూ.49తో పందెం కాశాడు. బ్రిస్బేన్ హిట్, సిడ్నీ థండర్ మధ్య జరిగిన మ్యాచ్లో తనకు నచ్చిన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసుకున్నాడు. ఆ జట్టే ఆ టోర్నిలో విజయం సాధించింది. దాంతో రాజురామ్ రూ.కోటి గెలుచుకున్నాడు. ఆ కోటి రూపాయల్లో పన్నుల కింద రూ.30 లక్షలు పోగా మిగిలిన రూ.70 లక్షలు అతడి ఖాతాలో జమయ్యాయి. దాంతో రాజురామ్ తో పాటు అతని కుటుంబసభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.