Tuesday, May 21, 2024

సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌

spot_img

మహేశ్వరం : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి  చెందుతుందని, సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల పరిధిలోని ఉప్పుగడ్డ తండాకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌ లో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. రోజుకో హామీతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ప్రతి పక్ష నాయకులు గందరగోళంలో పడ్డారని వెల్లడించారు.

Latest News

More Articles