Monday, May 13, 2024

బీజేపీకి మరో షాక్.. జితేందర్ రెడ్డి ఔట్

spot_img

అనూహ్యంగా కేవలం ఒకే నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్దిని బీజేపీ ప్రకటించింది. మహబూబ్ నగర్ అభ్యర్దిగా జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పేరును పార్టీ ప్రకటించింది. తొలుత ఈ స్థానం నుంచి జితేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని పార్టీ ఆలోచన చేసింది. అయితే, జితేందర్ రెడ్డి తాను ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పటంతో.. చేసేదేమిలేక ఇప్పుడు ఆయన కుమరుడి పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీజేపీ.

జితేందర్ రెడ్డి పోటీ నుండి తప్పుకోవటం బీజేపీకి మరో షాక్ అనుకోవచ్చు. మహబూబ్ నగర్ ఎలాగో బీఆర్ఎస్ తప్పకుండ గెలిచే సీటు కాబట్టే.. పరువు పోకుండా పోటీనుండి జితేందర్ రెడ్డి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇతర పార్టీల్లో పరిణామాల నేపథ్యంలో కొత్తగా వస్తున్న అభ్యర్థనలపై మరోసారి కసరత్తు చేసి, మిగతా 67 మంది అభ్యర్థుల జాబితాను ఈ నెలాఖరుకు ఖరారు చేస్తారని అంచనా వేస్తున్నారు. తొలి జాబితాలో ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలకు అవకాశం ఇచ్చారు. తొలి జాబితా ప్రకటన తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడారు.

Latest News

More Articles