Monday, May 20, 2024

రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది

spot_img

రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని స్పష్టం చేశారు మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు. ఇవాళ(శుక్రవారం) మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కరీంనగర్ జిల్లా రామగుండంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాను కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిని అయినప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు.

రామగుండంలో ఒక్క సీటు కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన అభివృద్ధి జరగదన్నారు గోనె ప్రకాష్ రావు. రామగుండంలో జరిగిన అభివృద్ధి మెడికల్  కాలేజీ, సబ్ ట్రెజరీ కార్యాలయం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. చందర్ గెలిస్తేనే తిరిగి రామగుండం అభివృద్ధి చెందుతుందని చెప్పారు గోనె ప్రకాష్ రావు.

ఇది కూడా చదవండి: రైతుబంధు బంద్.. కాంగ్రెస్ దారుణం

Latest News

More Articles