Wednesday, May 8, 2024

కర్ణాటకలో కటిక చీకట్లు.. కాంగ్రెస్ దుష్టపాలన

spot_img

కాంగ్రెస్‌ పాలనలో కర్ణాటకలో కటిక చీకట్లు అలుముకొన్నాయని.. కాంగ్రెస్‌ను గెలిపించి తాము పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని కన్నడ ప్రజలు లబోదిబోమంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అక్కడ రైతులకైతే పట్టుమని 5 గంటల కరెంట్‌ కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొన్నదని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాడు మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని పోతన్ పల్లి, మాచన్ పల్లి, రామచంద్రపురం గ్రామాల్లో మంత్రి పర్యటించారు.

పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కర్ణాటక పరిస్థితి మనకు దాపురుస్తుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంత్రి.. గ్రామ కూడళ్లలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు… కర్ణాటకలో కరెంట్ కష్టాలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ సబ్ స్టేషన్లలో మొసళ్లను తెచ్చి వదిలి నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అలాంటి కష్టాలు మనకు రాకుండా చేసిన సీఎం కేసీఆర్ కు మరోసారి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు కరెంటు బిల్లులు కట్టలేదని మోటార్లు లాక్కుపోయేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితే లేకుండా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.

రైతు బంధు, బీసీ బంధు, దళితబంధు, ఉచిత గొర్రెలను పంపిణీ చేస్తుంటే చూసి ఓర్వలేక ఆపేయాలని కాంగ్రెసోళ్లు ఫిర్యాదు చేశారని… రైతులు పేద ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ తీరుకు ఇది నిదర్శనం అన్నారు. పేద ప్రజలకు అందిస్తున్న పథకాలను కేవలం ఒక్క నెల రోజులు మాత్రం ఆపగలరని ఆ తర్వాత కానీ ఎవరూ ఆపలేరని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Latest News

More Articles