ఐపీఎల్ మ్యాచ్ 2024 మ్యాచ్ లు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఏ జట్లు టాప్ లో ఉన్నాయి.. ఏ టీంలు చివరి స్థానంలో ఉన్నాయి అని ఇప్పటికే ఓ అంచనాకి వచ్చాయి.ఈ నేపథ్యంలో ఇవాళ(బుధవారం) రాత్రి 7.30కి హైదరాబాద్ లో జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూఫర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ కీలకంగా మారనుంది. రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ కి చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పని సరి.
సన్ రైజర్స్, లక్నో రెండు జట్లు చెరో 12 పాయింట్లతో సమాన స్థాయిలో ఉన్నాయి. అయితే రన్ రేట్ ప్రకారం హైదరాబాద్ టాప్ 4 లో ఉంటే, లక్నో మాత్రం 6 వస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్ లు జరిగాయి. మూడింటిలోనూ లక్నోనే విజయం సాధించింది.
అయితే ఇవాళ జరగనున్న మ్యాచ్ కు వాన గండం పొంచి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. నిన్న(మంగళవారం) సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం కురవడంతో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దయ్యింది. అవుట్ ఫీల్డ్ మొత్తం వాన నీటితో నిండిపోయింది.
ఇది కూడా చదవండి:వర్షం మిగిల్చిన విషాదం..నాలాలో కొట్టుకువచ్చిన మృతదేహాలు..!