Sunday, May 19, 2024

క్రిశాంక్ ఇష్యూ..రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సీరియస్.!

spot_img

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచల్ గూడ జైల్లో కలిశారు. మన్నె క్రిశాంక్ ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..క్రిశాంక్ పోస్టు చేసిన సర్క్యూలర్ తప్పా అని ప్రశ్నించారు. చేయని తప్పుకు క్రిశాంక్ ను జైల్లో వేశారంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వెధవ పనికి క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. క్రిశాంక్ పై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి..రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ బుద్ది తెచ్చుకోవాలన్నారు. క్రిశాంక్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

ఇది కూడా  చదవండి: ఎయిరిండియాకు ఝలక్..మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఉద్యోగులు.!

Latest News

More Articles