ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం ఉదయం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం ఆలయం దగ్గరకు చేరుకున్న ప్రధానికి దర్శనాంతరం మోదీ కోడె మొక్కులు కూడా చెల్లించుకున్నారు.
కాగా నేడు వేములవాడలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మంగళవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. ఇవాళ ఉదయం వేములవాడకు వెళ్లి అక్కడ రాజన్న ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
#WATCH | Telangana: Prime Minister Narendra Modi offers prayers at Sri Raja Rajeshwara Swamy Devasthanam in Vemulawada, Karimnagar district. pic.twitter.com/jTbisq8qHg
— ANI (@ANI) May 8, 2024
ఇది కూడా చదవండి : సినీఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ నటి కన్నుమూత.!