Monday, May 20, 2024

హైదరాబాద్ నగరంలో ఘోరప్రమాదం..గోడకూలి ఏడుగురు దుర్మరణం.!

spot_img

మంగళవారం కురిసిన భారీ వర్షం హైదరాబాద్ లో విషాదం నింపింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. వేసవి సమయంలో కురిసిన ఈ అకాల వర్షానికి హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఘోరప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ గోడకూలింది. దీంతో ఏడుగురు కార్మికులు గోడకింద చిక్కుకుని మరణించారు. ఈ ప్రమాదంలో మరణించినవారంతా ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతులు తిరుపతి (20), శంకర్‌ (22), రాజు (25), ఖుషి (23), రామ్‌ యాదవ్‌ (34), గీత (32), హిమాన్షు (4) గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి బాచుపల్లిలోని మమతా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఓ మహిళతోపాటు నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ప్రజలకు పోలీసు శాఖ హెచ్చరిక..అప్రమత్తంగా ఉండాలంటూ..!

Latest News

More Articles