Monday, May 20, 2024

రైతుబంధు బంద్.. కాంగ్రెస్ దారుణం

spot_img

ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదిరించలేక కాంగ్రెస్ పార్టీ రైతులపై విషం చిమ్మడం అమానుషం అన్నారు జోగు రామన్న. ఓటమి భయంలో రైతు బంధు లాంటి సంక్షేమాలు నిలిపేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు చేస్తుందని అన్నారు. గతంలోనూ రైతులపై మూడు గంటల కరెంటు అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ రైతుబంధు నిలిచిపోయేలా చేయటం.. కాంగ్రెస్ వైఖరి ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జోగు రామన్న.

బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గణేష్ నాయుడు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాయినింగ్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్య అతిథిగాపాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకొలి గ్రామానికి చెందిన కిరణ్ రాహుల్ గణేష్ బిజెపిలో యూత్ సభ్యులుగా రాణించారు. అయితే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేలా కారు గుర్తు పార్టీలో చేరారు. వీరితో పాటు మరో వందమంది యువకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఎమ్మెల్యే జోగు రామన్న.

Latest News

More Articles