Saturday, May 18, 2024

నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.. బీజేపీపై బండి సంజయ్ ఆవేదన

spot_img

తెలంగాణ బీజేపీపై వరుసగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మాజీ చీఫ్ బండి సంజయ్. బీజేపీ అధిష్టానం కావాలనే బండి సంజయ్ కుమార్‌ను సైడ్ చేసిందనే ఆరోపణలను ఆయన తన అనుచరవర్గంతో నిత్యం చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకైతే బహిరంగంగా బండి సంజయ్ పార్టీ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తపరచలేదు. అయితే తాజాగా, ఆయన పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కినట్టు తెలిసింది. బీజేపీ తొలి జాబితాలో బండి సంజయ్ కుమార్‌ను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో నిలిపింది. ఈ నిర్ణయంపై ఆయన తన సన్నిహితుల ముందు బాధపడినట్టు సమాచారం. తన ఇమేజ్‌ను దెబ్బతీయడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని వాపోయినట్టు తెలిసింది.

బీజేపీ రాష్ట్ర నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అనాసక్తి చూపిస్తున్నారు. బండి సంజయ్ కుమార్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో విముకత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఒక వేళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తనను నిలపాలని భావిస్తే.. పార్టీ బలం ఉన్న ముధోల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమనీ సంకేతాలు ఇచ్చారు. కానీ, రెండు సార్లు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మళ్లీ అక్కడే బరిలో నిలిపిందని బండి పేర్కొన్నారు. తాను గెలిచే అవకాశాలు పెద్దగా లేకున్నా కరీంనగర్‌లో దింపిందని, ఇది కేవలం తన ప్రతిష్టను దెబ్బతీయడానికేనని బండి సంజయ్ తన మిత్రుల వద్ద బాధపడినట్టు సమాచారం.

 

Latest News

More Articles