Friday, May 17, 2024

లోక్‎సభ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీకి షాక్

spot_img

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన విక్రమ్‌గౌడ్.. ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారుగా చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఏదో ఒక గ్రూప్ రాజకీయాలలో ఉంటేనే పార్టీలో మనుగడ అని చెప్పుకొచ్చారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోలేదని లేఖలో విక్రమ్‌గౌడ్ పేర్కొన్నారు.

Read Also: ఏపీ నుంచి హైదరాబాద్‎కు బస్సుల్లో 30కేజీల గంజాయి

Latest News

More Articles