ఆంధ్రప్రదేశ్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ఆదివారం ఉదయం పర్యాటక శాఖ పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 12 మందితో వెళ్తున్న బోటు.. ఒక్కసారిగా తిరగబడింది. వీరిలో 10 మంది ఒడ్డుకు చేరగా.. ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా.. ఒక యువతి మృతదేహం లభించింది. మరోకరి కోసం గాలిస్తున్నారు. పడవలో ప్రయాణిస్తున్న వారంతా తంజావూరుకు చెందిన పర్యాటకులుగా పోలీసులు భావిస్తున్నారు.