Friday, May 17, 2024

ఫిబ్రవరి 3 నుంచి బీఆర్‌ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు

spot_img

తాజాగా బీఆర్ఎస్ లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఇక ఇప్పుడు ముగిసిన అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. అందుకోసం ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించాలని ప్లాన్ చేసింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే పరాజయం పాలైనట్లు పార్టీ భావించింది. చివరగా జరిగిన నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు మొదలవుతాయని తెలిపారు.

Read Also: బీటెక్ పానీపూరి వాలీకి జీప్ గిఫ్ట్‎గా ఇచ్చిన ఆనంద్ మహీంద్ర.. వైరల్ వీడియో

Latest News

More Articles