దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఇవాళ(శనివారం) కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్లో ఆమె మాట్లాడారు. కుల గణన కోసం దేశంలోని అన్ని దిక్కుల నుంచి డిమాండ్ వస్తున్నట్లు తెలిపారు. కుల గణన డిమాండ్తో బీజేపీ నిద్రలేని రాత్రులు గడుపుతోందని విమర్శించారు. జాతీయ స్థాయిలో సరైన పద్ధతిలో కుల గణన చేపట్టాలని, ప్రజలకు అందాల్సిన హక్కుల్ని అందేలా చూడాలని మాయావతి డిమాండ్ చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 4వ తేదీన ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 22వ తేదీ వరకు 15 సిట్టింగ్స్ ఉంటాయి.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో 18 విమానాలు దారిమళ్లింపు