Sunday, April 28, 2024

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని పూజలు

spot_img

సికింద్రాబాద్‌ : కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని బీఆర్‌ఎస్‌ నాయకులు పూజలు చేశారు. సికింద్రాబాద్‌లోని చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో పద్మారావుగౌడ్‌ భారీ మెజార్టీతో గెలుస్తారని వారు ధీమా వ్యక్తంచేశారు.

సీఎంగా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని, మరోసారి ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. గడిచిన 10 ఏండ్లలో తెలంగాణ ప్రజలకు సంక్షేమం,అభివృద్ధి పథకాలు శ్రీరామ రక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి, రాజాసుందర్‌, టీవిశ్రీను, శ్రీధర్‌, వెంకట్‌, గౌడ్‌శ్రీను, డైమండ్‌శ్రీను, శంకర్‌, సతీష్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles