Saturday, May 11, 2024

ఎల్లుండే టెన్త్ పరీక్ష ఫలితాలు

spot_img

తెలంగాణలో ఈనెల 30వ తేదీన పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఎస్ఎస్సీ బోర్డు ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసింది. 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీసులో ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేస్తారు. కాగా రాష్ట్రంలో మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు. పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ కూడా ఈ మధ్యే పూర్తయ్యింది. ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఎస్ఎస్సీ బోర్డు అఫిషియల్ వెబ్ సైట్లో విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులకు అందుబాటులో అధికారిక లింక్ ను కూడా అందుబాటులో ఉంచనుంది.

ఇది కూడా చదవండి: ఓటీటీలోనూ దూసుకుపోతున్న టిల్లు స్క్వేర్.!

Latest News

More Articles