అగ్రదేశం అమెరికాకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తమ అంతరిక్ష ఆస్తులపై వాషింగ్టన్ దాడులకు ప్రయత్నిస్తే.. మేం ఆ దేశ నిఘా శాటిలైట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
గతవారం కిమ్ ప్రభుత్వం ఓ నిఘా ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలో అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఎదురయ్యే ముప్పును వివిధ మార్గాల ద్వారా ఎదుర్కొంటామని, ఉ.కొరియా ప్రయోగాన్ని ఉద్దేశించి అమెరికా హెచ్చరించింది.