సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో దారుణం జరిగింది. కాలేజీలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అందరు చూస్తుండగానే కాలేజీ భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకేసింది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినిని రేణు శ్రీ గా గుర్తించారు. బీటెక్ సీఈసీ ఫస్టియర్ చదువుతున్నట్లు తెలుస్తోంది . గీతం యూనివర్సిటీ అధికారులు ఘటన సమాచారాన్ని పోలీసులకు అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు