Sunday, May 19, 2024

భారత్‎కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కెనడా..!!

spot_img

భారత్ విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యవహరిస్తోన్న తీరుతో ఇరు దేశాల మధ్య దిగజారుతున్న వేళ…కెనడా భారత్ కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. భారత్ కు గణతంద్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఢిల్లీలోని ఆ దేశ హైకమిషనర్ కార్యాలయం హిందీ, ఇంగ్లీష్ లో పోస్టు చేసింది.

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో భారత్ పేరు చేర్చిన ట్రూడో ప్రభుత్వం ఈ ఉద్రిక్తలకు మరింత ఆజ్యం పోస్తూనే ఉంది.

కాగా అటు అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి కూడా మన దేశానికి రిపబ్లిక్ డే సందేశాలు పంపించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ఈ వేడుకలకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.

ఇది కూడా చదవండి:స్పృహ తప్పి పడిపోయిన మహమూద్ అలీ

Latest News

More Articles