భారత హాకీ జట్టు ప్లేయర్ , అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్ పై కేసు నమోదైంది. గత ఐదేండ్లుగా వరుణ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
2019లో ఇన్స్టాగ్రామ్లో వరుణ్తో పరిచయం ఏర్పడిందని ఆ యువతి ఫిర్యాదులో తెలిపింది. అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గత ఐదేళ్లుగా వరుణ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. కోచింగ్ క్యాంపుల కోసం బెంగళూరులోని సాయి స్టేడియంకు వచ్చిన సమయంలో వరుణ్ తనతో శృంగారంలో పాల్గొనేవాడని ఆరోపించింది..అంతేకాదు ప్రస్తుతం తన ఏజ్ 22 ఏళ్లుగా తెలిపింది.
పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే.. తనకు అలాంటి ఉద్దేశం లేదని అంటున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. యువతి ఫిర్యాదు తో బెంగళూరులోని జ్ఞాన భారతి పోలీసులు వరుణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం వరుణ్ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: విద్యార్థినుల ఆత్మహత్య అనుమాస్పదంగా ఉంది