భారత్ లో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. ఎన్ని పనులన్నా సరే పక్కన పెట్టి టీవీలకు అతుక్కుపోతుంటారు అభిమానులు. టాస్ వేసిన దగ్గర నుంచి చివరి బాల్ వరకు కన్ను ఆర్పకుండా చూస్తునే ఉంటారు. తమ అభిమాన బ్యాట్స్ మన్ కానీ బౌలర్ కానీ వీకెట్లు తీసినా..పరుగులు పెట్టినా మనోళ్ల సందడి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం.
70 biryanis ordered by a household in chandigarh in one-go, seems they already know who’s winning 👀 #INDvsPAK pic.twitter.com/2qQpIj5nhu
— Swiggy (@Swiggy) October 14, 2023
అయితే ఈనెల అక్టోబర్ 14న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా చంఢీగడ్ లోని ఓ కుటుంబం ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 బిర్యానీలను ఆర్డర్ చేసింది. ఈ విషయాన్ని స్విగ్గీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టారు. దీనికి 94,000 లైక్లు వచ్చాయి.ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది. నేను 86 వడపావ్ లను ఆర్డర్ చేశానని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా శ్రీలంకలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లోనూ ఓ వ్యక్తి ఏకంగా 63 బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు స్వీగ్గి పోస్టు చేసింది.
Party mode on🔥🔥🔥
— Falcon X (@Falcon007X) October 14, 2023
అయితే ఈ మ్యాచ్ లో భారత్ పాక్ ను ఘోరంగా ఓడించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 191 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. తర్వాత బ్యాంటింగ్ చేసిన భారత్ 30.3ఓవర్లతో తన లక్ష్యాన్ని చేధించింది. 7 వికెట్లతో విజయం సొంతం చేసుకుంది.