Friday, May 17, 2024

ఉండవల్లిలో తన ఇంటికి చేరుకున్న చంద్రబాబు..జననీరాజనాలు..!!

spot_img

మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ ప్రయాణం 14గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. 14.30గంటల ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. నిర్విరామంగా సాగిన ఈ ప్రమాణంలో చంద్రబాబు చాలా అలసిపోయారు. చంద్రబాబు ఉండవల్లిలో తన నివాసానికి చేరుకోగానే నాయకులు, కార్యకర్తలు, అమరావతి రైతులు ఉద్విగ్నానికి లోనయ్యారు. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. బాబు ఇంటికి అమరావతి రైతులు, మహిళలు భారీగా చేరుకున్నారు.

మహిళలుచంద్రబాబుకు ఆయన నివాసం దగ్గర గుమ్మడికాయతో దిష్టి తీశారు. దారిపొడవునా చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. తెల్లవారుజాము వరకు వేల సంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు. ఈ సుదీర్ఘ ప్రయాణంపై చంద్రబాబు పోలీసులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎందుకు ఆలస్యం అవుతుందని అడగా పెద్దెత్తున అభిమానులు రావడంతో జాప్యం జరుగుతోందని ఒత్తిడి చేస్తే శాంతిభద్రతలకు సమస్య వస్తుందని పోలీసులు తెలిపినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ఎన్నికల కోడ్‎తో హైదరాబాద్‎లో ఇండియన్ రేసింగ్ లీగ్‎ రద్దు

Latest News

More Articles