Monday, May 20, 2024

కలకాలం పథకాలు ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలి

spot_img

ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో పలు ప్రభుత్వ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ సంక్షేమ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎంబిసి వృత్తిదారుల సంక్షేమ కోసం ఈ కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెల జిల్లాలో 300 మందికి చెక్కులు అందజేస్తాం. గత ప్రభుత్వాల హయాంలో ఏ స్కిమ్ పెట్టిన కంటితుడుపుడుగా ఉండేది. సీఎం కేసీఆర్ హయాంలో ఎంతో పారదర్శకంగా పధకాలను అమలు చేస్తున్నారు. 14,880 మందిని జిల్లాలో అర్హులుగా గుర్తించాం. ఇటువంటి స్కీములు చేయాలంటే సీఎం కేసీఆర్ కే సాధ్యం. దానికి గుండె ధైర్యం కావాలి.

కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. ఇప్పటివరకు 12 లక్షల మంది ఆడ పిల్లలకు చెక్కులు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. 80 కోట్ల రూపాయల విలువైన చెక్కులు జిల్లాలో అందజేసాము. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. బీసీ కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ సీఎం కేసీఆర్ ఆదుకున్నారు. నాయి బ్రాహ్మణులు, రజకులకు ప్రభుత్వం 250 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాము. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడు సారి ముఖ్యమంత్రి ఐతే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతాయి, లేకపోతే ఆగిపోతాయి. నియోజకవర్గంలో 3,000 మందికి గృహాలక్షి పధకం అమలు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు ఎంత కరెంట్ కోతలు ఉన్నాయో మీకు తెలుసు… ఇప్పుడు ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉందా అని ప్రజలు గమనించాలి. జిల్లాలో 45 వేల మంది కి ఒక్క రూపాయి తీసుకోకుండా పంపు కనెక్షన్లు ఇచ్చాము. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి…బడుగు బలహీన వర్గాలకు ఎవరు అండగా ఉన్నారో’ అని పువ్వాడ పేర్కొన్నారు.

Latest News

More Articles