Friday, May 3, 2024

గులాబీమయమైన ముంబై హైవే.. 600 కార్లతో సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్‌..!

spot_img

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో బయలుదేశారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో సీఎంకి ఘన స్వాగతం పలికారు BRS శ్రేణులు.

పటాన్ చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని హైదరాబాద్-ముంబై నేషనల్ హైవేపై భారీగా ప్రజలు సీఎంని చూస్తూ అభివాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై రహదారి అంత గులాబీ మయమైంది. రహదారి పొడుగునా పూలు చల్లుతూ, గులాబీ కాగితాలు వెదజల్లుతూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్ నినాదాలు చేస్తూ.. దేశ్ కి నేత కేసిఆర్ అంటూ దారి పొడవునా ఘన స్వాగతం పలుకుతున్న టిఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ అభిమానులు

 

Latest News

More Articles