Monday, May 13, 2024

ఒకే కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణ్ లు

spot_img

తాజాగా మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఈ సన్మానాన్ని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరు కోడలు ఉపాసన కామినేని కొణిదెల తన కుటుంబంలో ఇప్పుడు ఇద్దరు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు ఉన్నారని వెల్లడించారు. ఉపాసన తాత అపోలో హాస్పిటల్స్ గ్రూప్ అధినేత సి. ప్రతాప్ రెడ్డికి 2010లో పద్మవిభూషణ్ లభించింది.

ఇప్పుడు, ఆమె మామగారు భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించబడ్డారు. ఈ ఇద్దరు కలిసి దిగిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉపాసన ఇలా రాశారు. “సినిమా & దాతృత్వంలోనే కాకుండా జీవితంలో నాన్నగా, మామగారిగా మరియు తాతగా మీ స్ఫూర్తికి అభినందనలు. ఇప్పుడు కుటుంబంలో ఇద్దరు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు ఉండటం గౌరవం & ఆశీర్వాదం. మా తాత డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి & మా నాన్న డాక్టర్ చిరంజీవి కొణిదెల” అని అన్నారు.

Latest News

More Articles