మొన్నటివరకు కంటెంట్ ప్రమోషన్స్ లో పోటీ పడ్డ చిరంజీవి, బాలయ్యలు ఇప్పుడు స్ట్రైట్ ఫైట్ కి మరో అడుగు దూరంలో ఉండగా.. ప్రతిష్టాత్మక ప్రీ రిలీజ్ బిజినెస్ లోను ఢీ అంటే ఢీ అనేలా పోటీ పడుతున్నారు. తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం 88 కోట్ల రూపాయలు జరిగినట్టు తెలుస్తుంది. ఆంధ్రా హక్కులు రూ. 40 కోట్లకు, నైజాం రూ. 18 కోట్లకు, సీడెడ్ జిల్లా రూ. 14.5 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక ఆడియో, ఇతర విక్రయాలకి అదనంగా మరో 6.5 కోట్లు వీరయ్యకి వచ్చాయట. అయితే ఆచార్య పెద్ద ఫ్లాప్ కావడంతో ఈసారి వీరయ్య బిజినెస్ తగ్గిందని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. వాల్తేరు వీరయ్యలో రవితేజ కూడా ఉండటంతో వీరయ్య ప్రీ రిలీజ్ బిజ్ 100 కోట్లకు చేరుకుంటుందని భావించినా అది సాధ్యపడలేదని తెలుస్తుంది.
ఇక మరోవైపు సింగిల్ గానే బాలకృష్ణ మూవీకి మంచి బిజినెస్ జరిగిందని అంటున్నారు. వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం 73 కోట్ల రూపాయలు అయ్యిందట. ఆంధ్రా హక్కులు రూ. 35 కోట్లకు, నైజాం రూ. 15 కోట్లకు, సీడెడ్ జిల్లా రూ. 12.5 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 6.5 కోట్లకు వీరసింహారెడ్డి అమ్ముడుపోయిందట అమ్ముడవ్వగా.. ఆడియో హక్కులతో వీరసింహారెడ్డికి మరో 5 కోట్లు వచ్చాయట. ఇక యు.ఎస్ ప్రీ రిలీజ్ బిజినెస్లో వీర సింహా రెడ్డి లక్షా ఇరవై వేల డాలర్స్ను దాటేసింది. వాల్తేరు వీరయ్య సినిమా లక్షా మూడు వేల డాలర్స్ను క్రాస్ చేసింది. తెలుగు స్టేట్స్లో చిరంజీవి దూకుడు చూపిస్తే .. యు.ఎస్లో బాలయ్య జోరు చూపిస్తున్నారని నెటిజన్స్ అంటున్నారు. జనవరి 12న రిలీజ్ అవుతున్న బాలయ్య సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు అయితే.. జనవరి 13న రిలీజ్ అవుతున్న వాల్తేరు వీరయ్య సినిమాకు బాబి డైరెక్టర్.