Saturday, May 18, 2024

జడ్జీలు నియామక ప్రక్రియ మరింత పారదర్శకం

spot_img

జడ్జీల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతోందన్నారు సీజేఐ డివై చంద్రచూడ్. హైకోర్టులు, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల నియామకానికి ఆబ్జెక్టివ్ పారామీటర్‌ని నిర్దేశిస్తామని తెలిపారు. నియామకాలకు అర్హులైన దేశంలోని అత్యున్నత న్యాయమూర్తులను అంచనా వేయడానికి ప్రణాళిక రూపొందిస్తామని.. దీనికి పరిశోధన కోసం కేంద్రం విస్తృత వేదికపై పని చేయడం ప్రారంభించిందన్నారు. జడ్జీలపై అందుబాటులో ఉన్న డేటా, వారు వెలువరించే తీర్పుల ఆధారంగా మదింపు జరుగుతుందని తెలిపారు.హైకోర్టులు, సుప్రీం కోర్టుకు నియామకాల కోసం ఆబ్జెక్టివ్ ప్రమాణాలతో ఒక పత్రాన్ని తయారుచేస్తామని, దేశంలోని టాప్ 50 మంది న్యాయమూర్తులను అత్యున్నత న్యాయస్థానంలో నియమించడానికి అంచనా వేస్తామన్నారు సీజేఐ డివై చంద్రచూడ్.

సుప్రీం కోర్ట్ కొలీజియం “క్లోజ్​డ్​ డోర్​ సిస్టం”గా విమర్శలను ఎదుర్కొంది. 30 ఏండ్ల నాటి కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా, జవాబుదారీగా లేదనే విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల వ్యవస్థ అసమర్థంగా ఉందని మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

Latest News

More Articles