Sunday, May 19, 2024

కాంగ్రెస్ అసలు రూపం ఇదే.. ఓటేసి ఆగం కావద్దు

spot_img

జడ్చర్ల: కర్ణాటకలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నైజం బయటపడ్డదని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారంనాడు  జడ్చర్లలో  నిర్వహించిన  ప్రజా ఆశీర్వాద సభలో  సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల సమయంలో 20 గంటల పాటు  విద్యుత్ ను రైతులకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.

Also Read.. ఒక్కడే నిలబడి నన్ను గెలిపించిండు.. లక్ష్మారెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు

కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గంటల పాటు  విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ సీఎం మంగళవారం ప్రకటించిందని తెలిపారు. తెలంగాణలో రైతులకు  మూడు గంటల విద్యుత్ సరిపోతుందని  కాంగ్రెస్ నేతలు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు  మూడుగంటల కంటే ఎక్కువ విద్యుత్ రాదని హెచ్చరించారు.  కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతారని కేసీఆర్  స్పష్టం చేశారు.

Latest News

More Articles