Tuesday, May 21, 2024

గిరిజ‌నుల‌టే అంత చులకనా? రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఫైర్

spot_img

ఖ‌మ్మం : గిరిజ‌నులపై నోరు పారేసుకున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిపడ్డారు. గిరిజ‌నుల‌కు వెయ్యి నోటు చేతిలో పెట్టి గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారా..? ఇదేనా గిరిజ‌నుల‌కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మ‌ర్యాద అని కేసీఆర్ ధ్వజమెత్తారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

Also Read.. ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేస్తే.. గుండు సున్నా చేసిండు.. తుమ్మ‌ల‌పై కేసీఆర్ ఫైర్

‘‘బెల్ల‌య్య నాయ‌క్‌కు ఎమ్మెల్యే టికెట్ రావాల‌ని లంబాడీ హ‌క్కుల పోరాట స‌మితి వాళ్లు పోరాటం చేస్తుంటే.. వాళ్ల‌ది ఏంది.. వెయ్యి నోటు చేతిలో పెట్టి ఇంత గుడుంబా పోస్తే వాళ్లే ఓటు వేస్తారు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇదేనా గిరిజనుల‌కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మ‌ర్యాద‌. గిరిజ‌నుల‌కు గుడుంబా పోసి ఓట్లు తీసుకుంటారా..? ఇంత అహ‌కారంతోని మాట్లాడే పార్టీ రేపు ఎవ‌రికి న్యాయం చేస్త‌ది.’’ అని గిరిజ‌నుల‌కు కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

Latest News

More Articles