Saturday, May 18, 2024

నేనింకా రిటైర్ కాలేదు

spot_img

మిండియా మాజీ కెప్టెన్,  ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ కు సారథిగా  వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్‌ ధోని వచ్చే ఐపీఎల్‌లో ఆడతాడా..? 42 ఏండ్లున్న ధోని.. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నా  ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు.   గత రెండేండ్లుగా ధోనికి ఇదే ఆఖరి సీజన్‌ అన్న వార్తలు వినిపిస్తున్నా..ధోని మాత్రం ఎప్పటికప్పుడూ తన రిటైర్మెంట్‌పై సస్సెన్స్ ను  కొనసాగిస్తున్నాడు. 2023 సీజన్‌లో  చెన్నై ఐదోసారి కప్‌ గెలిచాక  ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అనుకున్నా.. ధోని మాత్రం  స్పష్టమైన సమాధానం చెప్పలేదు.

డిసెంబర్‌లో  ఐపీఎల్‌ మినీ వేలం జరుగనున్న నేపథ్యంలో  జట్లు రిటైన్‌, రిలీజ్‌ చేసుకునే  ఆటగాళ్ల జాబితాను  నవంబర్‌ 15లోగా అందజేయాలని  బీసీసీఐ.. ఫ్రాంచైజీలకు  డెడ్‌ లైన్‌ విధించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఓ కార్యక్రమంలో ధోనితో యాంకర్‌  ‘మీరు  ఇప్పుడు రిటైర్‌ అయ్యారు’ అని అనగానే  చెన్నై సారథి కల్పించుకుని.. ‘వన్‌ సెకండ్‌… నేను రిటైర్ అయింది అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి మాత్రమే..’ అని  ఆన్సర్‌ ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.  దీంతో ధోనితో పాటు  చెన్నై అభిమానులు.. వచ్చే సీజన్‌లో కూడా ధోని ఆడతాడని   కామెంట్స్‌ చేస్తున్నారు.  గత సీజన్‌లో భాగంగా ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత  మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న  ధోని.. డిసెంబర్‌లో  తన నిర్ణయాన్ని తెలిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌ల్లే పాలేరుకు మోక్షం

Latest News

More Articles