Friday, May 3, 2024

కాంగ్రెస్ వస్తే రైతు మెడకు ఉరి తప్పదు. చెడ్డ ప్రభుత్వం వస్తే ఐదేళ్లు శిక్ష అనుభావించాల్సి వస్తుంది

spot_img

సిద్దిపేట : పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ కంటే ఏది గొప్పది కాదని,  దుబ్బాకలో చదువుకున్న.. ఇక్కడి నుంచే సిఎం గా ఎదిగినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నా, తగినంత పరిణతి రాలేదన్నారు.  దుబ్బాక ప్రజలు ఎంతో చైతన్య వంతులని ప్రశంసలు కురిపించారు. ఎన్నికలు వస్తే అగం కావద్దని, పోటీలో ఉన్న అభ్యర్థులు.. వారి వెనక ఉన్న పార్టీల చరిత్ర చూడాలని, ఎవరి చేతిలో తెలంగాణ సుభిక్షంగా ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలని సీఎం కోరారు. దుబ్బాక లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా అశిర్వాధ సభలో పాల్గొని మాట్లాడారు.

‘‘ఉన్న తెలంగాణ ను ఊడగొట్టింది కాంగ్రెస్. కాంగ్రెస్ దద్దమ్మలే 58 ఏళ్ల తెలంగాణ కష్టాలకు కారణం.  1969 లో తెలంగాణ 400 మంది ఉద్యమ కారులను పిట్టలను కాల్చినట్లు కాల్చింది, ఎమర్జెన్సీ తెచ్చింది. 15 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చున్నం.  ప్రజల వద్ద ఉండే ఒక ఒక వజ్రాయుధం ఓటు. మన తలరాత మార్చేది ఆ ఓటే. చెడ్డ ప్రభుత్వం వస్తే ఐదేళ్లు శిక్ష అనుభావించాల్సి వస్తుంది.  2014లో తెలంగాణ వచ్చినంక ఎట్లా ఉండేదో మీకు తెలుసు. కరెంట్ లేదు, సాగు నీరు లేదు, రైతుల ఆత్మహత్యలు గందరగోళంగా ఉండే.  2004 తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మనతో కలిసి పోటీ చేసింది.

ఇక్కడా, అక్కడా అధికారంలోకి వచ్చింది. అయినా తెలంగాణ ఇవ్వకుండా మళ్ళీ కాంగ్రెస్ దోకా చేసింది. కాంగ్రెస్ దొఖా చేస్తే.. నాకు తిక్క రేగి కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని దీక్షకు దిగితే కేంద్రం దిగివచ్చింది. అయినా కాంగ్రెస్ ది మళ్ళీ అదే మోసం..  రైతుబందు అనే పదాన్ని సృష్టించిందే కేసీఆర్, బిఅర్ఎస్ పార్టీ. రైతుబందు దుబారా చేస్తున్నరని ఉత్తం కుమార్ రెడ్డి అంటున్నడు. 24 గంటల కరెంట్ అవసరం లేదు, మూడు గంటలు సాలు అంటుండు పిసిసి అధ్యక్షుడు.. 10 హెచ్ పీ మోటార్లు పెట్టాలి అంటున్నడు.. 10 హెచ్ పీ మోటార్లు పెట్టుకుంటారా ? అంత డబ్బు ఎవడు ఇవ్వాలి. కాంగ్రెస్ వస్తే రైతు మెడకు ఉరి తప్పదు.

రైతుబందు తీసేసి.. భూమాత పెడతరట..  అది భూ మాతనా, భూ మేతనా. మూడేళ్లు తల్లాడి ధరణి పోర్టల్ తెచ్చిన. ధరణి ని తీసేసి బంగాళాఖాతంలో పడేస్తనంటున్నరు కాంగ్రెసోళ్ల, రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి ఎద్దు ఎం తెలుసు.. లో ఎవుసం ఎం తెలుసు.  ధరణి తీసేస్తే రైతుబందు ఎట్ల పడుతుంది.. భూమాత తెచ్చి కౌలు రైతులకు రైతుబంధు ఇస్తరట.. ఐదేండ్లు వాళ్ళు ఉంటే మీ భూములు గోవిందా .. మన వేలుతో మన కండ్లు పొడుచుకుందామా..?

ప్రభాకర్ రెడ్డి పదేళ్లుగా ఎంపిగా ఉన్నడు. చిమకు కూడా హాని చేయదు. దుబ్బాక లో ఎప్పుడైనా కట్టిపొట్లు చియినమా. మనకు కత్తులు లేవా.. అది పద్దతి కాదు. ఉప ఎన్నికల్లో నేను ప్రచారానికి రాలే.. ఎప్పుడు వస్తే ఈ కథే ఉండేది కాదు. ఏకాన పని చేయని మోసగాళ్ళు గెలిచిండ్రు  157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా తెలంగాణలో ఇయ్యలే. ప్రతి జిల్లాకు ఒక్క నవిదయ ఇవ్వాలి.. ఒక్కటంటే ఒక్కటీ తెలంగాణ కు ఇయ్యలే. వంద ఉత్తరాలు రాసిన. ఒక్కటంటే ఒక్కటి ఇయ్యని బిజెపి కి ఓక్క ఓటు కూడా ఎందుకు వేయాలి. అసైండ్ భూములు గుంజుకుంటామనడం పచ్చి అబద్దం.. వారికి పట్టాలు ఇయ్యలని నిర్ణయించినం. ప్రభాకర్ రెడ్డి గెలిచినంక నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్ తెచ్చుకుందాం. నెత్తిమీద కుండ లెక్క మల్లన్నసాగర్ ఉంది.. దుబ్బాక కు లక్ష కు పైగా ఎకరాల్లో సాగు నీరు వస్తుంది.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

Latest News

More Articles