Saturday, May 18, 2024

కిషోర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే..  మొత్తం తుంగతుర్తికి దళిత బంధు

spot_img

సూర్యపేట జిల్లా: నల్గొండ దామరచర్లలో 30 వెల కోట్లతో యాదాద్రి  పవర్ ప్లాంట్ కడుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బంధు పథకం అద్భుతమైన మార్పు తెస్తుందని, దశాబ్దాలుగా దళితులు మోసానికి గురవుతున్నారని, అందుకే తెలంగాణలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తుంగతుర్తి తిరుమలగిరి సమరభేరి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. తెలంగాణ ఒట్టిగా ఇవ్వలే.. బిడ్డల ప్రాణాలను బలితీసుకొన్నరు.. నిప్పులు చెరిగిన కేసీఆర్

‘‘తుంగతుర్తి నియోజకవర్గంలో  ఫైలెట్ ప్రాజెక్టుగా తిరుమల గిరి మండలంలో అమలు చేసాము. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి  కిషోర్ కుమార్ మంచి పనులు చేశారు. గాదరి కిషోర్ ను  లక్ష ఓట్ల మెజారిటీ తో  గెలిపించాలి. ఉద్యమంలో నాతో పని చేసాడు. గొప్ప పోరాటం చేసాడు. ఈ ఎన్నికల్లో  కిషోర్ మంచి మెజార్టీతో గెలిలవాలి. గాదరి కిషోర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలో మొత్తం దళిత బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

Latest News

More Articles