తుంగతుర్తిలో గాదరి కిశోర్ కుమార్ ను మరో సారి లక్ష మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గం అంతా దళితబంధు పథకం అమలు చేస్తామని సంచలన హామీ ఇచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని అంటున్నారని.. అదే జరిగితే రైతు బంధు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా.. ఏ పార్టీ కూడా ఈ ప్రాంతంపై కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తుంగతుర్తి ప్రాంతం గతంలో కరువుకు గురైందన్నారు కేసీఆర్.