హైదరాబాద్: నియోజకవర్గానికి 3 వేల మందికి గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులను గుర్తించి.. వారికి మూడు దశల్లో నగదు అందజేస్తామన్నారు.
పునాది దశలో రూ.లక్ష, స్లాబ్ దశలో మరో రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష అందజేయాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.
ఇంటి నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు దశలవారీగా పథకాన్ని వర్తింపజేయాలని, నిర్దిష్ట విధివిధానాలను రూపొందించి కలెక్టర్లకు పంపించాలని సీఎస్ శాంతి కుమారిని సీఎం ఆదేశించారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.