Sunday, May 19, 2024

బీహార్‌లో కుప్పకూలిన తీగల వంతెన

spot_img

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఆదివారం కుప్పకూలింది. ఈ సంఘటనపై విచారణ ప్రారంభించాలని భవన నిర్మాణ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

భాగల్‌పూర్‌ను ఖగారియా జిల్లాతో కలిపే అగువానీ-సుల్తాన్‌గంజ్ వంతెన కూలిపోవడంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని భాగల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఈ అంశంపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రత్యయా అమృత్‌ను ఆదేశించారు.

Latest News

More Articles