Sunday, May 12, 2024

కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటికి భారీ షాక్.. 3.50 కోట్లు సీజ్!

spot_img

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న 3.5 కోట్ల రూపాయల నగదును అధికారులు పట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి చెందిన డబ్బుగా అధికారులు చెబుతున్నారు. పక్కా సమాచారంతో ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు శ్రీరామ్ నగర్ లో తెల్లవారుజామున రూ. 3.50 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఐటి, ఈసీ ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారుల జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఈ నగదును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల పొంగులేటికి చెందిన 8 కోట్ల రూపాయల నగదును 6 కార్లలో తరలిస్తుండగా రాజేంద్రనగర్ పరిధిలో అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Latest News

More Articles