నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. గురువారం పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసినా అనంతరం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్నారని అధికారులు తెలిపారు. ఇందులో సుమారు 16 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. వెంటనే విద్యార్థులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.