Tuesday, May 21, 2024

ఖమ్మం రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

spot_img

ఇల్లందు-ఖమ్మం ప్రధాన రహదారిలో ఇవాళ(గురువారం) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో దంపతులు చనిపోయారు. లలితాపురం గ్రామానికి చెందిన నిడికొండ సుబ్బారావు(55), అతని భార్య లలిత(49)  సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఇల్లందు వస్తుండగా.. కరెంట్ ఆఫీస్ ఏరియాలోని సుభాష్ నగర్ దగ్గర ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. దీంతో దంపతులు ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సుబ్బారావు చిరు వ్యాపారి. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు.

Latest News

More Articles