Friday, May 10, 2024

వృద్ధురాలికి మత్తు మాత్రలు ఇచ్చి.. బంగారంతో ఉడాయించిన నకిలీ వైద్యుడు

spot_img

హైదరాబాద్: నిమిషాల్లో జబ్బును మాయం చేస్తానని నమ్మించి..లాడ్జీకి వృద్దురాలిని రప్పించి,మత్తు మాత్రలు ఇచ్చి బంగారం తో ఉడాయించాడోక నకిలీ వైద్యుడు. సికింద్రాబాద్ గోపాల పురం పోలీస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ గోదావరి ప్రాంతానికి చేందిన నూకల సుజాత అనే మహిళ..కేపిహెచ్బి ప్రాంతంలో టీ షాప్ నడుపుకుంటుంది.అయితే ఈ నెల 2 వ తేదిన బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం విజయవాడ వెళుతుండగా..రైళ్ళో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పాడింది. తను నిమ్స్ లో సర్జన్ గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకోగా..తనకు ఉన్న పలు ఆరోగ్య సమస్యలను అతనికి వివరించింది సుజాత. అయితే తను ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తానని ..తను చెప్పిన ప్లేస్ కు వస్తే త్వరగా కోలుకునేలా మందులు ఇస్తానని చెప్పాడు.

అనంతరం గురువారం ఉదయం విజయవాడ నుంచి తిరుగు ప్రయాణం అయ్యి వస్తున్న సమయంలో వైద్యుడి నుంచి కాల్ రాగా..తను సికింద్రాబాద్ రైల్వె స్టేషన్ వద్ద వినాయక లాడ్జీలో ఉన్నానని..అక్కడికి వస్తే మందులు ఇస్తానని చెప్పడంతో అది నమ్మి ..అతనితో కలసి వినాయక లాడ్జీకి వెళ్ళింది వృద్దురాలు. లాడ్జీలో మందులు ఇచ్చి వెసుకోమని సూచించడంతో..మందులు వెసుకున్న కోద్ది సమయనికి స్పృహ కోల్పోయింది. తిరిగి మెలకువ వచ్చి చుసే సారికి ఓంటి పై ఉన్న బంగారంతో పాటు బ్యాగ్ లో ఉండవలసిన నగదు లేకపోవడంతో వెంటనే గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..సీసీ విడియోల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Latest News

More Articles