మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకున్నారు. 2006లోనే చిరంజీవికి పద్మభూషన్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి చిరంజీవి తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. భార్య సురేఖ, కొడుకు కోడులు రామ్ చరణ్ ఉపాసన, కూతురు సుస్మిత హాజరయ్యారు. చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటున్న సమయంలో రామ్ చరణ్ ఉపాసన చప్పట్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.