Monday, May 20, 2024

కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి..కారుబోల్తాపడి పార్టీ నాయకురాలి మృతి.!

spot_img

లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల వాహనం ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు దుర్మరణం చెందారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం యామన్ పల్లిలో సాయంత్రం కాంగ్రెస్ నాయకులతో కలిసి మహాముత్తారం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాడి కీర్తిబాయి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

అనంతరం అటవీ గ్రామమైన పెగడపల్లిలో ప్రచారం నిర్వహించేందుకు ఆమె భర్తతో కలిసి కారులో బయలు దేరారు. నిమ్మగూడెం సమీపంలోని మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి మట్టికుప్పను బలంగా ఢీకొట్టింది. దీంతో కీర్తిబాయి అక్కడిక్కడే మరణించింది. వాహనం నడుపుతున్న రాజయ్య కు తీవ్రగాయాలయ్యాయి. వాహనదారులు గమనించి వారిని అసుపత్రికి తరలించారు. మహాముత్తారం ఎస్సై సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కీర్తిబాయి 15ఏండ్లుగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

ఇది కూడా చదవండి: పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.!

Latest News

More Articles